హైదరాబాద్లో జరిగిన సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనను ప్రశంసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, 1994 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులను హైదరాబాద్కు తీసుకువచ్చి రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడంలో ఆయన తీసుకున్న చర్యలు అభివృద్ధికి బాటలు వేసాయని అన్నారు.
ప్రభుత్వాలు మారినా, గత ప్రభుత్వాలు అమలు చేసిన మంచి విధానాలను కొనసాగిస్తామని సీఎం స్పష్టం చేశారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కొన్ని సానుకూల విధానాలను కొనసాగిస్తూనే, కొత్త సంస్కరణలను ప్రవేశపెడుతున్నామని తెలిపారు.
అనంతరం శక్తి శాఖ (కార్మిక శాఖ)పై మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందించి ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.