NetiPrasthanam.in – Telugu News & Breaking News UpdatesPawan Kalyan Health Update: ఆస్పత్రిలో పవన్‌ను పరామర్శించిన మహారాష్ట్ర… › e-Paper Clip NetiPrasthanam.in – Telugu News & Breaking News Updates
Share: f 𝕏 in @
netiprasthanam.in 01 Aug 2026, 7:50 am
Date of Publish : 14 Jul 2026, 11:35 am  |  Posted by : NEWS DESK
👁 8 💬 0
Latest News > ఆరోగ్యం > ఆరోగ్య అలర్ట్స్

Pawan Kalyan Health Update: ఆస్పత్రిలో పవన్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

Pawan Kalyan Health Update: ఆస్పత్రిలో పవన్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

Pawan Kalyan Health Update: ఆస్పత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

ముంబై: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం స్వయంగా ఆస్పత్రికి వెళ్లి తెలుసుకున్నారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్‌ను కలిసి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పవన్ కల్యాణ్ కుడి భుజానికి ఇటీవల విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. శనివారం సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగిన ఈ శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. 2016లో జరిగిన భుజం గాయం, ఇటీవల రాజకీయ పర్యటనల సమయంలో అభిమానులు, కార్యకర్తల తాకిడి కారణంగా మరింత తీవ్రమవడంతో వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు.

ప్రస్తుతం పవన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన వేగంగా కోలుకుంటున్నారని వైద్య బృందం తెలిపింది. వైద్యుల సూచనల మేరకు ఆయన మూడు వారాల పాటు ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఆరు నెలల తర్వాత ఎడమ భుజానికి సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, ఎంపీలు ఆస్పత్రికి వెళ్లి పవన్ కల్యాణ్‌ను పరామర్శించారు. విశ్రాంతి తీసుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆస్పత్రికి వెళ్లి పవన్‌ను కలవడం రాజకీయాలకు అతీతంగా నాయకుల మధ్య ఉన్న పరస్పర గౌరవానికి నిదర్శనంగా నిలిచింది. తనను పరామర్శించిన ఫడ్నవీస్‌కు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.